close
Choose your channels

ఎల్లుండి ఎస్పీవై రెడ్డి ఇంటికి జనసేనాని

Thursday, May 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎల్లుండి ఎస్పీవై రెడ్డి ఇంటికి జనసేనాని

నంద్యాల ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ రెడ్డి తుదిశ్వాస విడిచారు. కాగా.. అంత్యక్రియలకు కొన్ని అనివార్యకారణాల వల్ల వెళ్లలేకపోయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 11వ తేదీన కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లనున్నారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ స్థానం నుంచి ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. 2019 ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులు పోటీ చేశారు. నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి, చిన్న కుమార్తె అరవిందరాణి బనగానపల్లి శాసనసభ అభ్యర్థిగా, పెద్ద అల్లుడు సజ్జల శ్రీధర్‌ రెడ్డి నంద్యాల శాసనసభ స్థానంలో పోటీ చేశారు. మే-23న వెల్లడికానున్న ఫలితాల్లో ఈ ముగ్గురి భవితవ్యం తేలనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.