close
Choose your channels

రజినీ అభిమానుల్లో ఉన్న ఆనందం.. సాయంత్రానికి ఆవిరి..

Wednesday, December 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రజినీ అభిమానుల్లో ఉన్న ఆనందం.. సాయంత్రానికి ఆవిరి..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడుతున్న విషయం కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఊహాగానాలకు కొదువ లేకుండా పోతోంది. మంగళవారమైతే ఏకంగా పార్టీ పేరు, గుర్తు గురించి భారీగా ప్రచారం జరిగింది. పార్టీ పేరు.. ‘మక్కల్‌ సేవై కట్చి’ అని.. ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించిందని కూడా ప్రచారం సాగింది. అయితే ఉదయం ఉన్న అభిమానుల ఉత్సాహం సాయంత్రం అయ్యే వరకూ ఆవిరై పోయింది.

కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయిస్తూ ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటనలో కొత్త పార్టీలను రిజిస్టర్‌ చేసుకున్నవారికి చిహ్నాలను సైతం కేటాయించింది. ఆ జాబితా చివరన మక్కల్‌ సేవై కట్చి అనే పార్టీకి ఆటో గుర్తును కేటాయించినట్టు ఉంది. అది చూసిన రజినీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ అభిమాన నాయకుడి పార్టీ పేరును ‘మక్కల్‌ సేవై కట్చి’గా కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్‌ చేయించారని సంతోషపడ్డారు. అంతేకాకుండా ఆటో గుర్తును కేటాయించడం పార్టీకి కలిసొచ్చే అంశంగా భావించారు.

అయితే మంగళవారం సాయంత్రం అయ్యే వరకూ అభిమానుల ఆనందం ఆవిరై పోయింది. రజనీ అభిమానులను నిరుత్సాహపరిచేలా రజనీ మక్కల్‌ మండ్రం నేత వీఎన్‌ సుధాకర్‌ ఓ ప్రకటన జారీ చేశారు. పార్టీ పేరు, పార్టీ గుర్తుపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆ సమాచారం వాస్తవం కాదని, రజనీ మక్కల్‌ మండ్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ అభిమానులు, మక్కల్‌ మండ్రం నేతలు ఓర్పు వహించాలని ఆ ప్రకటనలో సుధాకర్‌ విజ్ఞప్తి చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.