close
Choose your channels

‘లోకేశ్‌ను చూస్తే వణకు.. బాలయ్యకు బాబు అన్యాయం’

Wednesday, December 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘లోకేశ్‌ను చూస్తే వణకు.. బాలయ్యకు బాబు అన్యాయం’

వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా ఎలాంటి వారిపై అయినా విమర్శలు గుప్పించడంలో ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే. అది అసెంబ్లీనా.. మీడియా పాయింటా..? లేకుంటే ఇంటర్వ్యూనా అనేది చూడకుండా నోటికొచ్చినట్లు తిట్టేస్తుంటారు. తనపై.. మరీ ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఎవరైనా విమర్శలు గుప్పిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. బుధవారం నాడు నాడు అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రోజా.. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ , బాలయ్యపై సెటైర్ల వర్షం కురిపించారు. టీడీపీ నేతలు హడావిడిగా ఉదయాన్నే లోకేశ్‌తో ప్రెస్‌మీట్ పెట్టించారని ఆమె వ్యాఖ్యానించారు.

లోకేశ్‌ను చూస్తే వణకు.. బాలయ్యకు అన్యాయం!

‘నారా లోకేశ్‌ను చూస్తుంటే.. మంత్రుల కాళ్లు వణుకుతున్నాయని చెబుతున్నారు.. అవును ఆయన్ను చూస్తే నా కాళ్లు కూడా వణుకుతున్నాయి. మంగళగిరి అని పలకడానికి లోకేశ్ ట్యూషన్ పెట్టించుకున్నారు’ అని లోకేష్‌పై రోజా సెటైర్ల వర్షం కురిపించారు. అంతటితో ఆగని రోజా.. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య గురించి మాట్లాడుతూ.. అసెంబ్లీలో బాలకృష్ణను మాట్లాడనివ్వడం లేదని.. చంద్రబాబు కళాకారులను అవమానిస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా, సీమ ప్రాజెక్టుల గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారంటూ శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు ఎద్దేవా చేస్తున్నారని రోజా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. అసెంబ్లీ సమావేశాల బ్రేక్ సమావేశంలో మీడియాతో మాట్లాడిన రోజా పై వ్యాఖ్యలు చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.