close
Choose your channels

‘ఫలితాల తర్వాత తెలుగుదేశం ప్యాకప్..!’

Monday, May 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘ఫలితాల తర్వాత తెలుగుదేశం ప్యాకప్..!’

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మే-23న వెలువడనున్నసంగతి తెలిసిందే. అయితే ఫలితాలకు ముందే అటు టీడీపీ.. ఇటు వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒక్కోసారి వీరి మాటల తూటాలకు పార్టీల అధిపతులే నోరెత్తలేని పరిస్థితి నెలకొంటోంది. తాజాగా వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం ప్యాకప్‌ అయిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. టీడీపీ పార్టీని బతికించుకోవడానికి దేశ రాజకీయాల్లో బ్రహ్మండమైన పాత్ర పోషిస్తున్నానని చంద్రబాబు తనకు తానుగా ఇమేజ్‌ సృష్టించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తమ్మినేని దుయ్యబట్టారు.

దమ్ము,ధైర్యం ఉందా..?

"ఫలితాలు రాకుండానే జాతీయ నేతనని చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది. అమరావతిలో సమీక్ష సమావేశాలు ఎన్నికల తర్వాత ప్రారంభించారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఓటమి భయం కళ్ల ఎదుట కనబడుతోంది. టీడీపీలో ఉన్న సీనియర్లకు సైతం తెలుసు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటే రేపు పార్లమెంటు స్థానాల్లో ఎన్ని గెలవబోతున్నావో సమాధానం చెప్పాలి. ఫలితాల వెలువడక ముందే రాష్ట్రాలు తిరిగి చంద్రబాబు స్వయంగా జాతీయ నాయకుడిగా ఎందుకు ప్రకటించుకుంటున్నారో అర్థం కావట్లేదు. రాహుల్‌గాంధీతో చంద్రబాబు ఎప్పడయితే చేతులు కలిపారో ఆనాడే ఎన్టీఆర్‌ స్ఫూర్తిని పాతిపెట్టేశారు. తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవంగా చెప్పుకునే దమ్ము,ధైర్యం ఉందా..?. కాంగ్రెస్‌కు పార్టీకి వ్యతిరేకంగా ఉద్భవించిన తెలుగుదేశంపార్టీ.. భారతదేశ రాజకీయాల్లో చరిత్ర హీనంగా మిగిలిపోయింది" అని తమ్మినేని చెప్పుకొచ్చారు.

జగన్‌ది చారిత్రాత్మక విజయం..!

"రాబోయే ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు పాలనకు కాలం చెల్లిపోతుంది. ఎన్నికల అనంతరం టీడీపీ బతికిబట్ట కట్టే పరిస్థితి లేదు. చంద్రబాబు ఇంకా ప్రజలను, టీడీపీ కార్యకర్తలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు.. చారిత్రాత్మక విజయాన్ని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కట్టబెట్టబోతున్నారు. అసెంబ్లీ స్థానాల్లోనే కాదు.. పార్లమెంటు స్థానాల్లో కూడా వైసీపీ విజయ దుందుంబి మోగించబోతోంది" అని తమ్మినేని సీతారం జోస్యం చెప్పారు. మే-23న ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో.. ఏ పార్టీ ప్రతిపక్షంగా ఉంటుందో తేలిపోనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.