close
Choose your channels

జాన్సీ కేసులో కొత్త ట్విస్ట్‌‌లు .. నానీ ఎవరు..!?

Sunday, February 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జాన్సీ కేసులో కొత్త ట్విస్ట్‌‌లు .. నానీ ఎవరు..!?

‘పవిత్ర బంధం’ సీరియల్ నటి నాగ జాన్సీ ఆత్మహత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌‌లో జాన్సీ ఉంటున్న ఫ్లాట్‌‌ను పరిశీలించడమే కాకుండా కుటుంబీకులు, ఇరుగుపొరుగు వారిని విచారించడం జరిగింది. ఈ సందర్భంగా జాన్సీ బెడ్రూమ్‌‌లో ఓ డైరీ దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ డైరీనే కేసులో కీలకం కానుందని తెలుస్తోంది. అయితే ఆ డైరీలో ఏముంది..? నిజంగానే ఆ డైరీ నాగ జాన్సీదేనా..? అనే విషయాపై ఆరా తీస్తున్నట్లు పంజాగుట్ట ఏసీపీ ఎర్రబెల్లి విజయ్‌కుమార్‌ మీడియాకు వివరించారు.

ఇంతకీ నానీ ఎవరు..?

ఇప్పటికే సూర్యతేజ చౌదరి వల్లే తన కుమార్తె ఇలా ఆత్మహత్య చేసుకుందని జాన్సీ కుటుంబీకులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా పోలీసులు జరిపిన సోదాల్లో లభ్యమైన డైరీలో మాత్రం ‘నానీ.. ఐ లవ్ యూ.. మిస్ యూ నానీ నువ్వు లేకుండా ఒంటరిగా ఉండలేకపోతున్నా..’ అని రాసి ఉంది. అయితే ఆ నానీ ఎవరు..? సూర్య తేజ్ ముద్దు పేరు నానీనా..? లేకుంటే నానీ అనే వ్యక్తి వేరేనా..? అనే కోణాల్లో పోలీసులు నిగ్గు తేల్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఆధారాలు వస్తాయా..!?

ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న సూర్యతేజ.. త్వరలోనే తాను హైదరాబాద్‌‌కు వస్తానని తన వద్ద ఆధారాలున్నాయని బయటపెట్టి అసలు విషయం వెలుగు చూస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు జాన్సీ ఆత్మహత్యకు తనకెలాంటి సంబంధం లేదని తాము ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పడం గమనార్హం. అంతటితో ఆగని సూర్య.. జాన్సీ చాలా మందితో పరిచయాలున్నాయని చెప్పుకొచ్చాడు. ఆయన హైదరాబాద్‌‌కు వస్తే అసలు విషయాలేంటనేది తెలిసే అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు త్వరలోనే సూర్యను విచారిస్తామని చెబుతున్నారు.

కాల్ డేటా.. ఫోన్ లాక్ కష్టమేనా..!?

ఆత్మహత్య అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెండు ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిలో ఒక ఫోన్ లాక్ ఓపెన్ అవ్వగా.. మరొకటి ఓపెన్ కావట్లేదని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే కాల్ డేటా రికార్డ్స్‌ను తెప్పించి చూస్తున్నామని విజయ్ కుమార్ చెప్పారు. కాగా ఇప్పటికే ఒక ఫోన్‌‌లోని వాట్సాప్ కాల్స్, చాటింగ్‌‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మొత్తానికి చూస్తే.. రెండో ఫోన్ లాక్ ఓపెన్ అయినా.. సూర్యతేజను విచారించినా నిజానిజాలేంటో తేలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా డైరీని నిశితంగా పరిశీలించి దాన్ని బట్టి ముందుకెళ్లినా త్వరగా కేసును ఛేదించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారం ఎప్పుడు తేలుతుందో..? అసలు దోషి ఎవరో..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.