అసెంబ్లీలో అల్లుఅర్జున్ ఫ్రెండ్ నోరు మెదపరేం!!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. ఏపీ అసెంబ్లీలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆప్త మిత్రుడు ఉన్నారు.. సరిగ్గా ఎన్నికల టైమ్లో తన మిత్రుడ్ని ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ సైతం బన్నీ విడుదుల చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన మరెవరో కాదు.. నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి భూమా ఫ్యామిలీని ఘోరంగా ఓడించి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి హిస్టరీ క్రియేట్ చేశారు.
శిల్పా రవి-బన్నీకి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీరిద్దరూ బిజినెస్ పరంగానూ.. వ్యక్తిగతంగానూ బెస్ట్ ఫ్రెండ్స్. వాస్తవానికి 2019 ఎన్నికల్లో నంద్యాలకు వెళ్లి రవి తరఫున ఎన్నికల ప్రచారం చేయాలని బన్నీ భావించారు.. అయితే మెగా ఫ్యామిలీ నుంచి పుట్టిన జనసేన ఉండగా.. వైసీపీకి సపోర్టు చేస్తే బాగోదని రద్దు చేసుకున్నారని టాక్. అప్పట్లో చిన్నపాటి బహిరంగ లేఖకే పరిమితం అయిన బన్నీ.. నంద్యాల ఎన్నికల్లో శిల్పా రవి ఘన విజయం సాధించడంతో స్టైలిష్ స్టార్ ఆనందానికి అవద్ధులేకుండా పోయిందట.
అయితే శిల్పా రవి ఎక్కడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖాలాల్లేవ్.. ఒక్క ప్రమాణ స్వీకారం రోజు తప్ప మరెప్పుడూ ఆయన మాట్లాడలేదు. దీంతో అసెంబ్లీలో మాట్లాడటానికి రవికి కొత్త అని భయమా..? లేకుంటే మాట్లాడటానికి అవకాశం రాలేదా..? అని సోషల్ మీడియా వేదికగా బన్నీ ఫ్యాన్స్, శిల్పా అనుచరులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయ్యా.. బన్నీ మీరైనా చెప్పండి అసెంబ్లీలో నోరు మెదపమని అంటూ నెటిజన్లు స్టైలిష్ స్టార్కు సలహాలిస్తున్నారు. అయితే ఈ విషయం బన్నీదాకా వెళ్తుందా..? ఒకవేళ వెళ్తే పరిస్థితేంటి..? ఫ్రెండ్కు సలహాలిస్తారా..? ఇవ్వరా అనేది తెలియాల్సి ఉంది. అసెంబ్లీకి కొత్త.. పైగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుకుని నిదానంగా మాట్లాడుతారమో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.