close
Choose your channels

ఎన్నికల ముందు బీసీలపై వైఎస్ జగన్ వరాల జల్లు

Sunday, February 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్నికల ముందు బీసీలపై వైఎస్ జగన్ వరాల జల్లు

2019 ఎన్నికల ముందు వైసీపీ ‘బీసీ గర్జన’ నిర్వహించింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వేదికగా జరిగిన ఈ సభకు భారీగా బీసీ సోదరులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నేతలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ టీడీపీని తొక్కి.. వైసీపీని గెలిపించాలని బీసీ సోదరులకు పిలుపునిచ్చారు. అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీసీల కోసం వైసీపీ చేపట్టబోయే కార్యక్రమాలు.. అధికారంలోకి చేసే విషయాలన్నింటినీ కలిపి ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ అహర్నిశలు కృషి చేస్తున్న బీసీ నేత జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ మాటిచ్చారు.

బీసీ కమిషన్.. సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత

"బీసీల సంక్షేమానికి ఏటా రూ. 15 వేల కోట్లు వెచ్చిస్తాం. 5 ఏళ్ల‌లో రూ. 75 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తాం. బీసీ స‌బ్ ప్లాన్‌కు చ‌ట్ట బ‌ద్ధ‌త క‌ల్పిస్తాం. మొద‌టి బ‌డ్జెట్‌లో స‌మ‌గ్ర బీసీ చ‌ట్టాన్ని తీసుకుని వ‌స్తాం. మూడో వంతు నిధులు బీసీల‌కు కేటాయిస్తాం. కార్పొరేష‌న్ల వ్య‌వ‌వ్థ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తాం. అన్ని కులాల‌కు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేస్తాం. ర‌జ‌కులు, చేనేత, మ‌త్స్య‌కారులు, బోయ‌లు, వాల్మీకులు, అగ్రికుల‌ క్ష‌త్రియులు, శాలివాహ‌న, దూదేకుల కొపుల వెల‌మ, శెట్టి బ‌లిజ‌, గాండ్ల ముదిరాజ్ భ‌ట్రాజు వంటి బీసీ కులాల‌కు మొత్తం 139 కార్పొరేష‌న్లు ప్రారంభిస్తాం. ఏ ఒక్క సామాజిక వ‌ర్గాన్ని నిర‌ర్ల‌క్ష్యం చేయ‌బోము. పార‌ద‌ర్శకంగా ప్ర‌తి అక్క‌కు 45-60 ఏళ్ల వ‌య‌సు మ‌హిళ‌ల‌కు రూ. 75 వేలు చేయూత ప‌థ‌కంకింది నాలుగు విడ‌త‌ల కింద ఉచితంగా ఇస్తాం. బీసీ విద్యార్తుల విద్య కోసం రూ 20 వేలు.

బీసీ పిల్ల‌ల‌ను బ‌డికి పంపితే ఏటా 15 వేలు ఇస్తాం. క‌మిటి, నివేదిక లేకుండా 32 కులాల‌ను మోస్ట్ బీసీలుగా గుర్తించారు. మా ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే బీసీ క‌మిష‌న్ ఏర్పాటు చేస్తాం. కాల‌ప‌రిమితి నిరంత‌రం ప‌ని చేసేలా ప‌రిధిని విస్త‌రిస్తాం. శాశ్విత ప్రాతిప‌దిక‌పై బీసీ క‌మిష‌న్ ఉంటుంది. స‌ర్టిపికెట్లు, కులాల కెట‌గ‌రీల మార్పు గురించి ఈ క‌మిష‌న్ ప‌ని చేస్తుంది. హేతుబ‌ద్ధంగా బీసీ క‌మిష‌న్ ప‌ని చేస్తుంది
రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు దూరంగా ఉండి ప‌ని చేసే క‌మిష‌న్ ఇది. బీసీ క‌మిష‌న్ పార‌ద‌ర్శ‌కంగా ప‌ని చేస్తుంది. బీసీ క‌మిష‌న్ సిఫార్సుల‌ను అమలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీలుగా మార్చే విష‌యాల‌ను సీరియ‌స్‌గా తీసుకుంటాం. అసెంబ్లీ కూడా తీర్మానాలు చేసి కేంద్ర అనుమ‌తికి పంపుతాం. బీసీ ఓట్ల కోసం ఈ విష‌యాల‌ను మీముందు చెబుతున్నా నిజాయితీగా 31 బీసీలు ఓబీసీ కెట‌గ‌రీలో లేనందున ఉద్యోగావ‌కాశాలు కోల్పోతున్నారు" అని జగన్ చెప్పుకొచ్చారు.

శవాన్ని పక్కన పెట్టుకుని పొత్తు గురించా..?

"నాలుగు సంవ‌త్స‌రాలు బీజేపీతో అంట కాగిన చంద్ర‌బాబు ఇప్ప‌టి దాకా గాడిద‌లు కాశారా?. ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రాలేదు? ఎందుకు లేఖ రాయ‌లేదు?. తెలంగాణ‌లో బీసీ జాబితాల నుంచి తొల‌గించిన 32 బీసీల‌ను తిరిగి బీసీలుగా గుర్తించేలా ఒత్తిడి తెస్తాం. హ‌రికృష్ణ శ‌వాన్ని ప‌క్క‌న పెట్టుకొని కేటీఆర్‌తో పొత్తు గురించి చంద్ర‌బాబు మాట్లాడుతారు కానీ బీసీల ఊసెత్త‌రు. తెలంగాణ బీసీల గురించి కేసీఆర్‌తో మాట్లాడుతాను" అని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

నామినేటెడ్ పదవులిస్తాం..

"ప్ర‌ైవేటు కాంట్రాక్టు ప‌నులు, అవుట్ సోర్సింగ్ ప‌నులు కల్పిస్తాం. 50 శాతం ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు, బీసీల‌కే వ‌ర్తిచేలా కొత్త చ‌ట్టం చేస్తాం. బీసీ కుల వృత్తిదారులు, చిరువ్యాపారుల‌కు గుర్తింపు కార్డులిచ్చి ఎపుడు అవ‌స‌రం అయితే అపుడు వారికి సున్నా వ‌డ్డీకే ప‌ది వేలు రుణం ఇస్తాం. బీసీ రాజ‌కీయంగా బ‌ల‌ప‌డ‌టానికి అన్ని నామినేటెడ్ ప‌ద‌వులు కల్పిస్తాం. అన్ని నియామ‌కాల‌కు ఈ క‌మిటీల‌లో 50 శ‌తం ఎస్సీ, ఎస్టీ మైనారిటీ బీసీల‌కే ప్రాతినిద్యం వహించేలా చేస్తాం. నామినేటెడ్ ప‌నుల‌లో కూడా 50 శాతం రిజ‌ర్వేష‌న్లు బ‌ల‌హీన‌వ‌ర్గాలు, బీసీల‌కే ఇస్తాం. నాయీ బ్రాహ్మ‌ణుల దుకాణాల‌కు ఏటా ప‌ది వేలు సాయం అందిస్తాం. సంచార జాతుల‌కు ఉచితంగా ఇళ్లే కాదు.. ఉపాధి స‌దుపాయం క‌ల్పిస్తాం" అని ఈ సభా వేదికగా జగన్ హామీ ఇచ్చారు.

మెస్‌చార్జీల కింద ఏడాదికి రూ.20 వేలు.. పిల్లల్ని బడులకు పంపే తల్లులకు రూ.15 వేలు..
"ప్ర‌త్యేక గురుకుల పాఠ‌శాలలు ఏర్పాటు చేస్తాం. ప్రతి విద్యార్థికి హాస్టల్‌ మెస్‌చార్జీల కింద ఏడాదికి రూ.20 వేలు.. పిల్లల్ని బడులకు పంపే తల్లులకు రూ.15 వేలు ఇస్తాము. పిల్లల ఉన్నత చదువులకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చంద్రబాబు నీరుగార్చారు. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజలు లక్షల్లో ఉన్నాయి. చంద్రబాబు ముష్టివేసినట్టు రూ.30 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. చంద్రబాబు పాలనలో పేదలు ఉన్నత విద్యకు దూరమయ్యారు. పిల్లల్ని చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కులాలను మోసం చేసే విషయంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు. చేయలేని పనులను చేస్తానంటూ చంద్రబాబు కులాలను రెచ్చగొట్టారు. ఓట్ల కోసమే ఎన్నికల ముందు బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు బీసీల కార్పొరేషన్లు చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదు?. ఎన్నికల ముందు హామీలిస్తున్నారు" అని బాబును ఎద్దేవా చేస్తూ జగన్ మాట్లాడారు.

మత్స్యకారులకు శుభవార్త..

"వేట నిషేధ‌ స‌మ‌యంలో మ‌త్స్య‌కారుల‌కు రూ. 10 వేలు ఇస్తాం. వేట‌కు వెళ్ళి చ‌నిపోతే ప‌ది ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా ఇస్తాం. చేనేత‌ల‌కు నెల నెలా రూ రెండు వేల పెట్టుబ‌డి కింద ఇస్తాం. యాద‌వుల గొర్రెలు, మేక‌లు చ‌నిపోతే ఆరు వేలు ఇస్తాం. బ్రాహ్మ‌ణుల‌కు క‌నీస వేత‌నం క‌ల్పిస్తాం. దేవాల‌యాల ట్ర‌స్టీలుగా యాద‌వులు, నాయీ బ్రాహ్మ‌ణుల‌ను నియ‌మిస్తాం. పేద‌లు ఆత్మ‌హ‌త్య‌ అకాల మ‌ర‌ణం చెందినా ..ఎస్సీ,ఎస్టీ, బీసీ, కావ‌చ్చు వారింద‌రికీ బీమా ప‌థ‌కం కింద 7ల‌క్ష‌లు ఇస్తాం. ఈ డబ్బును ఆడ‌ప‌డుచు క‌ట్నం కింద ఇస్తున్నాం. అందుకు ఓ కొత్త చ‌ట్టం తీసుకుని వ‌స్తాం. బీసీల‌ను వెన్నెముక‌గా తీర్చి దిద్దుతాం. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసాలను విన్నారు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్‌ అనే నేను.. మీ అందరి బిడ్డను.. మీ కోసం ఏం చేస్తానో చెబుతున్నాను. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక...బీసీ సంక్షేమానికి ప్రతి ఏటా రూ. 15 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెబుతున్నాను" అని జగన్ ఈ సందర్భంగా బీసీలకు హామీ ఇచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.