లీక్స్ కాకుండా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తూ పూర్తిగా ఎలక్షన్ మూడ్లో పడిపోయాయి. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాన్ని ఎలాగైనా సరే మళ్లీ దెబ్బ కొట్టాలని భావిస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మేనిఫెస్టోకు ముందు ప్రకటనలు చేస్తూ హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లోని ‘ రెండువేల రూపాయిల పెన్షన్’ను కాపీ కొట్టి ఫిబ్రవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. అయితే ఇది వైసీపీ నుంచి కాపీ కొట్టారా..? లేకుంటే స్వతహాగా ఆలోచించి ఇలా చేశారా అన్నది ఇక్కడ అప్రస్తుతం.
ఇప్పటి వరకూ అటు అధికార టీడీపీ.. ఇటు ప్రతిపక్ష వైసీపీ ఇంత వరకూ మేనిఫెస్టో ప్రకటించనే లేదు. కాబట్టి ఒకరి పథకాలు మరొకరు కాపీ కొట్టినా పెద్దగా నష్టమేమీ లేదు. చంద్రబాబు ఎలాగూ కాపీ కొట్టింది మన పథకాన్నే కదా..? దాంతో పోయేదేముంది.. త్వరలో రిలీజ్ చేయనున్న మేనిఫెస్టో విషయంలో మరింత జాగ్రత్త పడాలని తన పార్టీ కీలక నేతలతో, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచనలు చేశారని సమాచారం. ఆ మేనిఫెస్టో వివరాలు బయటికి పొక్కనియకుండా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తోందట వైపీపీ అధిష్టానం. మరీ ముఖ్యంగా పొరపాటున కూడా మేనిఫెస్టోకు సంబంధించి మూడో వ్యక్తితో మేనిఫెస్టో గురించి పంచుకోవడం.. ఫ్యామిలీతో కూడా చర్చించొద్దని గట్టిగా పార్టీ నేతలకు జగన్ చెప్పారట.
మొత్తానికి చూస్తే బాబు పెన్షన్ ఎఫెక్ట్తో అలెర్టయిన జగన్ పక్కా వ్యహంతో ముందుకెళ్తున్నారనే చెప్పుకోవచ్చు. అయితే రెండు వేల రూపాయిల పెన్షన్ వ్యవహారంపై వైసీపీ మరో ప్రకటన చేస్తుందని.. సమాచారం. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పెన్షన్పై పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తూ.. చంద్రబాబు ఫ్లెక్సీలకు ‘పెద్ద’లతో పాలాభిషేకం చేస్తున్నారు. అయితే టీడీపీ, వైసీపీ మేనిఫెస్టోలో ఏమేం ప్రకటన చేయబోతున్నారన్నది సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ మేనిఫెస్టోలో ఏమేం హామీలిస్తారో..? జనం ఎవరికి ఓట్లేసి గెలిపిస్తారో తెలియాలంటే మరో రెండు నెలు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.