close
Choose your channels

వీహెచ్‌ వ్యవహారంలో నగేశ్‌కు షాకిచ్చిన కాంగ్రెస్

Monday, May 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వీహెచ్‌ వ్యవహారంలో నగేశ్‌కు షాకిచ్చిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)పై ఇటీవల అఖిలపక్షం ధర్నాలో పీసీసీ కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. సీనియర్ నేత అని కూడా చూడకుండా వీహెచ్‌పై చేయిచేసుకోవడం.. ఎదురు మాట్లాడటాన్ని అధిష్టాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీంతో నగేశ్‌పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు అధిష్టానం స్పష్టం చేసింది. వివరాల్లోకెళితే.. సోమవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీ ఎదుట హాజరైన నగేశ్ ధర్నారోజు అసలేం జరిగింది..? తప్పెవరిది..? ఎందుకు చేయి చేసుకోవాల్సి వచ్చింది..? అని జరిగిన ఘటనపై వివరణ ఇచ్చుకున్నారు. నగేశ్ చెప్పిన విషయాలన్నీ లోతుగా పరిశీలించిన కమిటీ ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

నేను చేసింది తప్పే మరి వీహెచ్ సంగతేంటి..?

ఇదిలా ఉంటే.. తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన నగేశ్ గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. తనను అకారణంగా సస్పెండ్ చేశారని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన చెబుతున్నారు.‘అవును.. నేను చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నాను’ కానీ, ఈ ఘటనకు ముఖ్యకారకుడైన వీహెచ్‌ను ఎందుకు వదిలేస్తారు? అని ఈ సందర్భంగా క్రమశిక్షణా కమిటీని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు.. ఆరోజు జరిగిన సంఘటన దురదృష్టకరమని, క్షమాపణ కూడా కోరానని చెప్పారు. అసలు, ఆ సంఘటనకు ముఖ్యకారణం హనుమంతురావేనని నగేశ్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందో..? మరింత ముదురుతుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.