సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి.. కొంపదీసి తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తలొగ్గి వారి డిమాండ్లను నెరవేరుస్తున్నారా ఏంటి..? అని అనుకుంటున్నారా..? అస్సలు కాదండోయ్.. గత నెలలో రావాల్సిన జీతభత్యాలు రాకపోవడంతో ఆర్టీసీ ఆర్మికులు ఆందోళన చెందారు. అసలు ఆ జీతం వస్తుందో రాదో అని కార్మికులు టెన్షన్ పడ్డారు. ఈ టెన్షన్తో పలువురికి హార్ట్ ఎటాక్ వచ్చి ఆస్పత్రిపాలైన కార్మికులు కూడా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మికులు శుభవార్త తెలిపింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె పంచాయితీ తెలంగాణ హైకోర్టుకు చేరిన విషయం విదితమే. అంతేకాకుండా.. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సమ్మెకు దిగిన కార్మికులకు గతనెల వేతనాలు చెల్లిస్తామని హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. సమ్మె నేపథ్యంలో వేతనాలు ఇచ్చేందుకు సిబ్బంది లేరని.. అందుకే కార్మికులకు సోమవారం లోపు వారికి వేతనాలు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది.
అంతేకాదు.. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. కార్మికులతో సర్కారు చర్చలు జరపాలని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపింది. అంతటితో ఆగని హైకోర్టు.. ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే ఏం చేస్తారని ఈ సందర్భంగా ప్రశ్నించిన విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.