close
Choose your channels

లోకేశ్ సభలో జగన్ స్టికర్లు.. కంగుతిన్న తమ్ముళ్లు!

Saturday, February 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లోకేశ్ సభలో జగన్ స్టికర్లు.. కంగుతిన్న తమ్ముళ్లు!

ఆంధ్రప్రదేశ్ ‌‌వ్యాప్తంగా శనివారం రోజున ‘ఎన్టీఆర్ గృహకల్ప పథకం’లో భాగంగా లబ్ధిదారులకు ఇళ్ల అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు.. చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వడం జరిగింది. తిరుపతిలో ఈ కార్యక్రమం అనంతరం మంత్రి నారా లోకేశ్ ప్రసంగిస్తుండగా ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే స్టిక్లర్లతో ఉన్న కుర్చీలను ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆగ్రహంతో స్టేజ్‌‌పైన.. కిందున్న తెలుగు తమ్ముళ్లు ఒకింత కంగుతిన్నారు.

అప్రమత్తమైన టీడీపీ నేతలు వెంటనే ఆ కుర్చీలను సభా ప్రాంగణం నుంచి తీసేశారు. ‘ఏంటిది.. ఇలా చేస్తే మా నాయకుడి దగ్గర పరువుపోతుందని తెలుసు కదా.. చాలా టూమచ్‌‌’ అంటూ నిర్వాహకులపై నేతలు మండిపడ్డారు. మరోసారి రిపీట్ కాకుండా చూసుకుంటామని నిర్వాహకులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కాగా రెండ్రోజుల క్రితం తిరుపతి నుంచి వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ‘సమర శంఖారావం’ వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, ప్రజల కోసం పెద్ద ఎత్తున కుర్చీలు తీసుకురావడం జరిగింది. కొందరు అభిమానులు ఆ కుర్చీలకు స్టిక్కర్లు అతికించారు. అయితే తాజాగా జరిగిన సభలో అవేమీ చూసుకోకుండా తెలుగుతమ్ముళ్లు ఇలా చేయడంతో చినబాబు ఆగ్రహానికి కారణమయ్యారు. కాగా ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు, వైసీపీ అభిమానులు ఓ రేంజ్‌‌లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.