close
Choose your channels

పోలీస్‌ వ్యవస్థ, చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Saturday, February 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పోలీస్‌ వ్యవస్థ, చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌‌లో వ్యవస్థలను సీఎం చంద్రబాబు సర్కార్ భ్రష్టుపట్టించిందని వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌‌‌ నరసింహన్‌‌ను ఆయన కలిసి రాష్ట్రంలో దాదాపు 59.18 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాల్సిన అవసరం తెలియజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పోలీస్ వ్యవస్థ, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ సర్వేల పేర్లతో తెలుగుదేశం గవర్నమెంట్‌ మెషినరీ ద్వారా ప్రజా సాధికార సర్వే, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్, పరిష్కార వేదిక అంటూ పీరియాడిక్‌ సర్వేల పేరుతో వైసీపీ సానుభూతి పరుల ఓట్లను గుర్తించి వాటిని తొలగిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్‌‌కు జగన్ చేసిన ఫిర్యాదు గురించి కూడా గవర్నర్‌‌‌కు తెలియజేశామన్నారు. రాజకీయ స్వార్థం, అవసరాల కోసం పోలీసులను వాడుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో పోలీస్‌ వ్యవస్థ అతి దారుణంగా ఉందన్నారు.

ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ధర్మపోరాటం చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. చంద్రబాబు దీక్ష చేయడడం ఎలా ఉంటుందంటే.. ఒక వ్యక్తిని పొడిచి హంతుకుడే హత్యకు వ్యతిరేకంగా దీక్ష చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం అలాంటిదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని, బాబు ముఖ్యమంత్రి కావడం మన కర్మ అన్నారు. సాక్షాత్తు అసెంబ్లీలో ప్రత్యేక హోదాను నీరుగారుస్తూ చంద్రబాబు మాట్లాడిన మాటలు ఎవరూ మర్చిపోలేదని, ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రం ఏం బాగుపడ్డాయని, హోదా సంజీవనా..? అని మాట్లాడిన మాటలు ప్రజలు మర్చిపోలేదని వైఎస్ జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.