close
Choose your channels

బాదుడే... బాదుడు.. జగన్ మార్క్ దోపిడీ: లోకేశ్

Sunday, May 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాదుడే... బాదుడు.. జగన్ మార్క్ దోపిడీ: లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సెటైర్ల వర్షం కురిపించారు. ఇప్పటికే మద్యంపై భారీగా రేట్లు పెంచేసి దండుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ బిల్లుల పేరిట కొత్త దోపిడీకి తెరలేపిందని ట్విట్టర్ వేదికగా లోకేష్ మండిపడ్డారు.‘బాదుడే... బాదుడు... వైఎస్ జగన్ మార్క్ దోపిడీ. జగన్ విద్యుత్ బిల్లులు పెంచేసి విద్యుత్ వినియోగం తగ్గిస్తున్నారు.. అని వైకాపా నాయకులు దరువు వెయ్యడమే ఆలస్యం’ అని చినబాబు ట్వీట్ చేశారు. ఇందుకు ఓ వ్యక్తి ఇంటింటికి వెళ్లి మీటర్ పరిశీలించి బిల్లు ఇస్తున్న వీడియోను కూడా ఆయన జతచేశాడు. ఈ వీడియోలో ఉన్న విషయాలు చూస్తే కరెంట్ బిల్లులు చెల్లించాలనుకున్నవారికి ఎవరైనా షాకవుతారేమో.

మండిపడుతున్న జనం..

లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలలో బిల్లులు వేయలేదు కానీ యావరేజ్ మీదే చాలా మంది కట్టేస్తున్నారు. కొన్ని కొన్ని ఇళ్లకు భారీగానే కరెంట్ బిల్ వచ్చింది. దీంతో వినియోగదారులు ఆ బిల్స్ చూసి కంగుతింటున్నారు. ప్రభుత్వం ఎందుకిలా చేస్తోందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. యూనిట్స్ యూనిట్స్ అంటూ జగన్ సర్కార్ మమ్మల్ని దోచుకుంటోందంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసిస్తామని కొందరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా వ్యాధి వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను రీడింగ్ తీయకుండా సదరు రీడింగ్‌ను ఈ నెల అనగా మే లో తీసిన విషయం అందరికి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos