close
Choose your channels

టీడీపీ బాటలోనే వైసీపీ ఇసుక దోపిడీ

Monday, October 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ బాటలోనే వైసీపీ ఇసుక దోపిడీ

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలకంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని, వారికి అండగా నిలవడమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేన రాజకీయ కమిటీ సభ్యులు,

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక మాఫియాలో కోట్లు గడిస్తున్నారని, అధికారంలోకి వస్తే ఇసుక మాఫియాను రూపుమాపుతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు టీడీపీ బాటలోనే నడుస్తోంది. చీకటిపడితే అక్రమ ఇసుక రవాణాకు దారులు తెరుస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. విడతలవారీగా మద్యపాన నిషేధం, బెల్ట్ షాపులను నిర్మూలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇవాళ ఏ ఊళ్లో చూసినా మద్యం ఏరులై పారుతోంది. పార్టీ సంస్థాగతంగా బలోపేతం, స్థానిక ఎన్నికలు, ఇసుక, మద్యం పాలసీలపై రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించాం’ అని అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.