close
Choose your channels

మద్యం డోర్ డెలివరీపై ఆర్జీవీ ట్వీట్.. కేటీఆర్ పంచ్!

Saturday, April 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మద్యం డోర్ డెలివరీపై ఆర్జీవీ ట్వీట్.. కేటీఆర్ పంచ్!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. మరీ ముఖ్యంగా కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ నుంచి ఇప్పటి వరకూ చాలానే ట్వీట్స్ చేస్తూ అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. తాజాగా మద్యం డోర్ డెలివరీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలతో పాటు మంత్రి కేటీఆర్‌ను సైతం రెక్వెస్ట్ చేశాడు. ఇందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించలేదు కానీ.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే.. మంత్రి కేటీఆర్ మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఆర్జీవీ ట్వీట్‌కు కేటీఆర్ పంచ్‌ల వర్షం కురిపించారు. అసలు వీరి మధ్య జరిగిన సంభాషణ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పిచ్చిపిచ్చిగా..!

లాక్‌డౌన్‌తో ఒక్క నిత్యావసరాలు తప్ప మిగిలినవీ ఏమీ దొరకట్లేదు. వైన్స్ ఎక్కడికక్కడ మూత పడ్డాయ్.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం డోర్ డెలివరీ చేస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అస్సలు వైన్స్ తెరిచే ప్రసక్తే లేదన్నట్లుగా సీఎంలు ఉన్నారు. దీంతో మద్యం ప్రియులు పిచ్చి పట్టి చిత్ర విచిత్రాలుగా ప్రవర్తిస్తూ పిచ్చాస్పత్రికి క్యూ కడుతున్నారు. మరోవైపు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా కోకొల్లలు. ఇదిలా ఉంటే.. మందు దొరక్క ఫ్రస్టేషన్‌తో ఇంట్లో ఆడవారిని పట్టుకుని కొడుతున్న ఘటనలు కూడా ఉన్నాయ్. ఈ తరుణంలో వీటన్నింటినీ ప్రస్తావిస్తూ.. ఆర్జీవీ మద్యం ప్రియుల తరఫున ప్రభుత్వాలను రెక్వెస్ట్ చేశాడు.

ఇంతకీ ఆర్జీవీ ఏమని ట్వీట్ చేశాడు..!?

‘తెలుగు రాష్ట్రాల సీఎంలకు మద్యం డోర్ డెలవరీ చేసే విషయంలో పెద్ద మనసు చేసుకోవాలని కోరుతున్నాను. ఇళ్లలో ఉంటున్న మద్యం ప్రియులు ఏం చేయాలో తెలియక జుట్టుపీక్కుంటున్నారు. చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తూ ఏడుస్తున్నారు. మరోవైపు పిచ్చాస్పత్రుల్లో చేరుతున్నారు. మరికొందరైతే మద్యం లేక ఫ్రస్ట్రేషన్‌లో భర్తలు భార్యలను కొడుతున్నారు. మీరు కూడా మమతా బెనర్జీలా పెద్ద మనసు చేసుకుని మాకు ‘చీర్స్’ చెప్పండి’ అని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఇందుకు ఓ జాతీయ మీడియాలో పశ్చిమబెంగాల్ ప్రబుత్వం మద్యం డోర్ డెలివరీ చేస్తున్నట్లు ఉన్న కథనాన్ని జతచేశాడు. ఈ ట్వీట్‌ అతి తక్కువ సమయంలోనే నెట్టింట్లో హాట్ టాపిక్ అయిపోయింది.

కేటీఆర్ పంచ్!

ట్విట్టర్‌లో యమా యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. ఆర్జీవీ ట్వీట్‌కు వెంటనే రియాక్ట్ అయ్యారు. ‘రాము గారు.. మీరు మాట్లాడేది హెయిర్ కటింగ్ గురించే కదా..?’ అని ఆలోచిస్తున్నట్లు ఉన్న ఓ ఎమోజీని కేటీఆర్ పోస్ట్ చేశారు. వీరిరివురు ట్వీట్స్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. వీరిద్దరి మధ్య ఇలా సరదా సంభాషణ జరగడం ఇదేం మొదటి సారి కాదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.