close
Choose your channels

జూన్ నుండి మణిరత్నంతో చెర్రీ సినిమా

Wednesday, March 8, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్‌చ‌ర‌ణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రామ్‌ఛ‌ర‌ణ్‌, మ‌ణిర‌త్నంలు ఈ సినిమా గురించి చ‌ర్చ‌లు జ‌రిపారు. జూన్ నుండి ఈ క్రేజీ కాంబో మూవీ సెట్స్‌లోకి వెళ్ళ‌నుంది. ప్ర‌స్తుతం సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది.
డ్యూయెట్ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌లో బిజీగా ఉన్న మ‌ణిర‌త్నం డ్యూయెట్ సినిమాను ఏప్రిల్ 7న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ రా ఏంజెట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌ట‌. ప్ర‌స్తుతం రాంచ‌ర‌ణ్‌, సుకుమార్ సినిమా చిత్రీక‌ర‌ణ ఈ నెల 20 నుండి ప్రారంభం అవుతుంది. ఈ సినిమా కూడా జూలైలో పూర్త‌వుతుంంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.