close
Choose your channels

28న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ..

Friday, November 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

29న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ..

ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆకస్మికంగా ఆయన పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. భారత్ బయోటెక్‌లో కరోనా వ్యాక్సిన్ పురోగతిని మోదీ పరిశీలించనున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌కు రానున్నారు.

28వ తేదీ సాయంత్రం 4:10కి హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకోనున్నారు. వచ్చిన గంటలోనే తిరిగి మోదీ ఢిల్లీకి వెళ్లనున్నారు. తిరిగి సాయంత్రం 5:10 గంటలకు మోదీ ఢిల్లీకి వెళ్లనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రధాని మోదీ రాక ఉత్కంఠ రేపుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల బీజేపీ తరుఫున ప్రచారానికి అతిరథ మహారథులు రానున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవిస్ వచ్చి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

నేడు(శుక్రవారం) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేయనున్నారు. శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేధావుల సభకు హాజరవుతారు. అనంతరం, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగే రోడ్డు షోలో నడ్డా పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఈనెల 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కి రానున్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో నిర్వహించే రోడ్‌ షోలో అమిత్‌ షా పాల్గొని ప్రచారం నిర్వహించనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.