close
Choose your channels

వైఎస్ షర్మిళ ఫిర్యాదు చూసి పోలీస్ కమిషనర్ షాక్!

Tuesday, January 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైఎస్ షర్మిళ ఫిర్యాదు చూసి పోలీస్ కమిషనర్ షాక్!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిళ.. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ సీపీని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.‌ గత ఏదేళ్లుగా తనపై, తన కుటుంబంపై టీడీపీ కక్ష్యగట్టి మరీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని.. మరీ ముఖ్యంగా తనకు, టాలీవుడ్ హీరో ప్రభాస్‌ సంబంధాలున్నాయని విపరీతంగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మళ్లీ విషప్రచారం మొదలెట్టారని ఇలా చేస్తున్నవారిపై.. వారితో చేయిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ పోలీసులను నమ్మని షర్మిళ.. హైదరాబాద్‌‌లో ఫిర్యాదు చేశానని మీడియాతో మాట్లాడుతూ ఆమె చెప్పారు.

రాజకీయంగా ఎదుర్కోలేక..

ఫిర్యాదు చేసిన అనంతరం వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. టీడీపీ గురించి మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాలు చేయడం టీడీపీ డీఎన్‌ఏలోనే ఉందని ఆయన ఆరోపించారు. వైసీపీని రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని టీడీపీపై ఆయన మండిపడ్డారు. వైఎస్‌ షర్మిళపై టీడీపీ విషప్రచారాలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

ఫిర్యాదు చూసి సీపీ షాక్

2014 ఎన్నికలకు ముందు నుంచే ఈ ట్రోలింగ్స్ ప్రారంభమయ్యాయని.. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని మరోసారి ఇలాంటి దుష్ప్రచారాలకు తెరతీశారని సజ్జల చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే హైదరాబాద్‌ సీపీని కలిసి ఫిర్యాదు చేశామన్నారు. ఏపీ డీజీపీ లక్షణాలే అక్కడి పోలీసుల్లో ఉన్నాయన్నారు. ఇది మహిళలందరిపై జరుగుతున్న దాడిగా పరిగణించాలని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. అయితే తామిచ్చిన ఫిర్యాదు కాపీని చూసిన అనంతరం హైదరాబాద్‌ సీపీ షాక్‌కు గురయ్యారన్నారు. గతంలో ఇచ్చిన కాపీని కూడా తెప్పించుకొని సీరియస్‌గా యాక్షన్‌ తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.

దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం

కాగా.. షర్మిళ చేసిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకుగాను ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాల నుంచి సమాచారం. అదనపు డీసీపీ నేతృత్యంలో ఈ ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుంది..? ఆఖరిగా ఏమని రిజల్ట్ రాబోతోందో వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.