close
Choose your channels

నారా లోకేష్‌పై రోజా సెటైర్ల వర్షం!!

Friday, November 1, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నారా లోకేష్‌పై రోజా సెటైర్ల వర్షం!!

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌పై.. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా సెల్వమణి మరోసారి సెటైర్ల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై నారా లోకేష్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షపై ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా తిరుపతిలో రోజా మీడియాతో మాట్లాడుతూ సెటైర్ల వర్షం కురిపించారు. ‘లోకేష్ ఇసుక సమస్య మీద దీక్ష చేసినట్టు లేదని.. లావుగా ఉన్నాడు కాబట్టి డైటింగ్ చేసినట్టు ఉంది’ అని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇసుక కొరతకు చంద్రబాబు, లోకేష్ కారణమని రోజా విమర్శలు గుప్పించారు.

కాగా.. ఏపీలో ఇసుక కొరత ఉందని.. తద్వారా పలువురు భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు వేదికగా నారా లోకేష్ ఒకరోజు నిరాహార దీక్ష చేసిన విషయం విదితమే. ఈ దీక్ష వేదికగా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. విశాఖ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 3న లాంగ్ మార్చ్ చేపట్టిన సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.