close
Choose your channels

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

Thursday, March 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయబోయే పది మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో శాసనసభకు పోటీచేసి ఓడిన మాజీలు పలువురికి చోటు లభించింది. మరీ ముఖ్యంగా ఇటీవలే కాంగ్రెస్‌కు టాటాచెప్పి కమలం గూటికి చేరిన డీకే అరుణ మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం కన్ఫామ్ అయ్యింది. కాగా.. సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయను అధిష్టానం పక్కనపెట్టి ఆయన స్థానంలో కిషన్‌రెడ్డికి టికెట్టివ్వడం తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది.

తెలంగాణ లోక్ సభ అభ్యర్థులు..


1. కరీంనగర్ - బండి సంజయ్


2. నిజామాబాద్ - ధర్మపురి అరవింద్


3. మాల్కాజ్ గిరి - రామచందర్ రావు


4. సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి


5. మహబూబ్ నగర్ - DK అరుణ


6. నాగర్ కర్నూలు - బంగారు శృతి


7. నల్గొండ - గర్లపాటి జితేందర్ కుమార్


8. భోంగిర్ - PV శ్యాంసుందర్ రావు


9. వరంగల్ - చింతా సాంబమూర్తి


10. మహబూబ్ బాద్ - హుసేన్ నాయక్


కాగా.. ఇంకా ఏడు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ ఏడు స్థానాలకు పోటీ గట్టిగా ఉండటంతో శనివారం మధ్యాహ్నం లేదా.. సాయంత్రానికల్లా రెండో జాబితా వెలువడే అవకాశాలున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.