close
Choose your channels

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు.. కొత్తది ఇదే

Friday, March 18, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ప్రకటించింది. దీని ప్రకారం .. ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్స్ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 2వ తేదీ నుంచి పరీక్షలు మొదలవ్వాల్సి ఉండగా.. ఇదే సమయంలో ఇంటర్‌ పరీక్షలున్నాయి. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ ఈరోజు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది.

షెడ్యూల్‌ ఇదే..

ఏప్రిల్‌ 27 - తెలుగు

ఏప్రిల్‌ 28 - సెకండ్‌ లాంగ్వేజ్‌

ఏప్రిల్‌ 29 - ఇంగ్లిష్

మే 2 - గణితం

మే 4 - సైన్స్‌ పేపర్‌-1

మే 5 - సైన్స్‌ పేపర్‌-2

మే 6 - సాంఘిక శాస్త్రం

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.