వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలు ఎందుకు మార్చినట్లు!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ వాహనాల్లో మార్పు చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ జగన్ కాన్వాయ్లో ఉన్న వాహనాలతో పాటు కొత్తగా 6 నలుపు రంగు ఫార్చ్యునర్ వాహనాలను ప్రవేశపెట్టడం జరిగింది. AP39 PA 2345 నెంబర్తో కొత్త వాహన శ్రేణిలో ఉంటుందని అధికారులు సీఎం భద్రతా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా.. పాత కాన్వాయ్ను హైదరాబాద్ పంపడంతో కొత్త వాటిని కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చుకుంది.
మార్పునకు కారణం ఇదీ...!
ఇదిలా ఉంటే.. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఇటీవల సీఎం ఛాంబర్, కేబినెట్ హాల్, హెలిపాడ్, సీఎం కాన్వాయ్ రూట్లను ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించిన విషయం తెలిసిందే. జగన్ నేమ్ ప్లేట్ను కూడా సుబ్బారెడ్డి పరిశీలించిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు స్కార్పియో కార్లను వాడిన విషయం విదితమే. అయితే వాటి స్థానంలో ఇప్పుడు ఫార్చునర్ కార్లను వాడేందుకు సీఎం భద్రతా సిబ్బంది నిర్ణయించింది. స్కార్పియో కార్లు హైదరాబాద్లో కూడా అవరసరం ఉన్న క్రమంలో వాటిని హైదరాబాద్కు పంపడం జరిగింది. అయితే ఇకపై కొత్త కాన్వాయ్లోనే జగన్ అమరావతిలో తిరగనున్నారు.
ఎన్నికల ఫలితాలకు ముందే..!
కాగా.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు 3 రోజుల ముందు నుంచే ఏపీలో వైఎస్ జగన్కు భద్రత పెరిగింది. జగన్కు జెడ్ కేటగిరీ భద్రత ఏర్పాటు చేయాలని కేంద్రం హోంశాఖ నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ వెంటనే ఏపీ పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జగన్కు అప్పట్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు, జెడ్ కేటగిరీ భద్రతను కల్పించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.