close
Choose your channels

రానున్న ఎన్నికల్లో పోటీపై వైఎస్ విజయమ్మ క్లారిటీ

Saturday, January 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రానున్న ఎన్నికల్లో పోటీపై వైఎస్ విజయమ్మ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని టీడీపీ.. గత ఎన్నికల్లో మిస్సయిన సీఎం పీఠాన్ని ఈసారి కచ్చితంగా కైవసం చేసుకోవాలని వైసీపీ.. తమ పార్టీ సత్తా ఏంటో చూపించడానికి జనసేన వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని పార్టీల అధినేతలు ఏపీలోని అన్ని జిల్లాల ప్రజలతో మమేకమవుతూ పెద్ద పెద్ద హామీలిస్తూ ముందుకెళ్తున్నారు. మరోవైపు టీడీపీ, వైసీపీ, జనసేన త్వరలోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అసలు వైఎస్ ఫ్యామిలీ నుంచి వైఎస్ జగన్‌‌తో పాటు ఇంకెవరు పోటీ చేస్తున్నారు..? ఒకవేళ పోటీచేస్తే ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనే విషయాలపై ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో.. గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన వైఎస్ విజయమ్మ ఈసారి మళ్లీ పోటీ చేస్తున్నారా..? లేదా అనే విషయాన్ని తాజాగా ఓ టీవీ చానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

విజయమ్మ మాటల్లోనే..
" ఎన్నికలకు ముందు ఎవరితోనూ పొత్తు పెట్టుకోము. ఈ విషయం ఇప్పటికే జగన్ చెప్పారు కూడా. గత ఎన్నికల్లో అవసరం మేరకు నేను పోటీ చేయాల్సి వచ్చింది.. అయితే ఇప్పుడు రాజకీయాలపై నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు.. పోటీ చేయననుకుంటా. ప్రచారానికి రమ్మని జగన్ పిలిస్తే వెళ్తాను.. అవసరం లేదనుకుంటే వెళ్లను. ఓ బిడ్డగా జగన్‌‌కు నా పూర్తి సపోర్ట్ ఉంటుంది. పార్టీ కోసం నావంతుగా సహకారం చేస్తాను" అని విజయమ్మ చెప్పుకొచ్చారు.

విజయమ్మను పోటీ చేయించాలనుకున్నది ఇక్కడ్నుంచే..!
కాగా.. గత ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయమ్మ.. బీజేపీ-టీడీపీ కలిసి బలపరిచిన కంభంపాటి హరిబాబు చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో.. విజయమ్మను కడప జిల్లాలో ఖాళీగా ఉన్న ‘జమ్మలమడుగు’ లేదా ‘బద్వేలు’ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి వైఎస్ జగన్ పోటీ చేయిస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఒకవేళ ఎంపీగా పోటీ చేయించాల్సి వస్తే.. గతంలో కడప పార్లమెంట్ నుంచి పోటీచేసిన వైఎస్ అవినాశ్ రెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీకి పంపించి.. ఇక్కడ్నుంచి విజయమ్మను ఎంపీగా పోటీ చేయించాలని కూడా వైసీపీ అధిష్టానం భావించినట్లు పుకార్లు వచ్చాయి. అయితే వైఎస్ విజయమ్మ తాజా వ్యాఖ్యలతో ఈ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పడినట్లైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.