close
Choose your channels

15 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. ఒక్కరోజే 654 మంది మృతి

Tuesday, July 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొద్ది రోజులుగా ప్రతి రోజూ దాదాపు 50 వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో కేసులు 15 లక్షలకు చేరువవుతుండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 47,703 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14,83,156కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4,96,988 యాక్టివ్ కేసులున్నాయి. 9,52,743 మంది కరోనా నుంచి కోలుకుని చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 654 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 33,425కు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.